: 16 మంది యువతులపై పోలీసుల అత్యాచారం... చత్తీస్ గఢ్ ప్రభుత్వానికి నోటీసులు

చత్తీస్ గఢ్ పోలీసులు 16 మంది యువతులపై అత్యాచారానికి ఒడిగట్టారని, వారిని దారుణంగా హింసించారని, అందుకు ప్రభుత్వానిదే బాధ్యతంటూ, జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అత్యాచారానికి గురైన 8 మందికి రూ. 3 లక్షలు, లైంగిక వేధింపులకు గురైన ఆరుగురికి రూ. 2 లక్షలు, భౌతిక దాడికి గురై బాధపడ్డ ఇద్దరికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని సూచించింది.

ఈ ఘటనలు 2015, 2016లో నమోదయ్యాయని, పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. తాము 20 మంది బాధితుల స్టేట్ మెంట్లను రికార్డు చేయనున్నట్టు పేర్కొంది. కాగా, నవంబర్ 2015లో దాదాపు 40 మంది పోలీసులు బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వార్త అప్పట్లో సంచలనం కలిగించింది. దీనిపై మీడియాలో వార్తలు వచ్చిన తరువాత ఎన్ హెచ్ఆర్ సీ స్పందించి స్వతంత్ర విచారణ జరిపించింది.

More Telugu News