: యూపీలో బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది: కట్జూ

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖట్జూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం వస్తుందని తెలిపారు. ఎస్పీకి మూడింట రెండొంతుల మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. మాయావతి పార్టీ బీఎస్పీ కన్నా బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆయన ఓ పోస్టు పెట్టారు.

2014 ఎన్నికల సమయంలో మోదీ గాలి వీచిందని... ఇప్పుడు ఎలాంటి గాలి లేదని కట్జూ చెప్పారు. కులం, మతం ఆధారంగానే 90 శాతం ఓటింగ్ నమోదవుతుందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో లబ్ధి పొందాలని మోదీ భావించారని... కానీ, అది విజయవంతం కాలేదని చెప్పారు. నోట్ల రద్దు వల్ల బీజేపీకి నష్టం జరిగే అవకాశాలను కొట్టి పారేయలేమని తెలిపారు.

More Telugu News