arrest: హైదరాబాద్ లో ఎస్‌ఐపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు

కారు పార్కింగ్‌ చేసే విషయంలో వాగ్వివాదం జరిగి, విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై  ఓ వ్యక్తి దాడి చేసిన ఘ‌టన‌ ‌హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో జ‌రిగింది. హుమయూన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సయీద్‌ అన్వర్ ఎస్ఐతో వాగ్వివాదానికి దిగి ఎస్‌ఐ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని తన కారుతో ఢీకొట్టాడు. దీంతో ఎస్‌ఐకి గాయాల‌య్యాయి. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు అన్వ‌ర్‌ను అరెస్టు చేశారు. గాయాల‌పాల‌యిన ఎస్ఐ అసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న వెంకటేశ్వర్లు అని మీడియాకు తెలిపారు. వెంక‌టేశ్వ‌ర్లును అన్వ‌ర్‌ అసభ్య పదజాలంతో దూషించి, ఈ దాడి జ‌రిపాడ‌ని చెప్పారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామని తెలిపారు.

More Telugu News