: ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన కానిస్టేబుల్ మృతి
కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఎస్సై దేహదారుఢ్య పరీక్షల్లో విషాదం చోటుచేసుకుంది. ఈ పరీక్షలకు హాజరయిన ఓ కానిస్టేబుల్ అస్వస్థతకు గురై, ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలుపుతూ అనంతపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న బాలాజీ నాయక్ ఈ రోజు ఉదయం ఈ పరీక్షలకు హాజరయ్యాడని తెలిపారు. పరీక్షల్లో పాల్గొంటుండగా అతను ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడని, ఆయనను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడని పేర్కొన్నారు.