: గుండెపోటుతో కమలహాసన్ సోదరుడు చంద్రహాసన్ భార్య కన్నుమూత
ప్రముఖ నటుడు కమలహాసన్ పెద్దన్నయ్య చంద్రహాసన్ భార్య గీతామణి (73) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు. శుక్రవారం ఆమె భౌతిక కాయానికి స్థానిక అళ్వార్పేటలోని చంద్రహాసన్ నివాసంలో కమలహాసన్, చారుహాసన్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అదే రోజు సాయంత్రం బీసెంట్నగర్లోని శ్మశాన వాటికలో గీతామణి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.