dhoni: మొదటి వార్మప్‌ మ్యాచ్‌కి ధోనీయే కెప్టెన్‌!

టీమిండియా స్టార్ ఆట‌గాడు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఈనెల 15 నుంచి ఇంగ్లండ్ తో జరగనున్న వన్టే, టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియా జట్టుకు విరాట్ కోహ్లీయే కెప్టెన్ అని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. అయితే, ధోని మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వ‌ర్తించ‌నున్నాడు. అయితే ప్రధాన పోటీలో కాకుండా వార్మప్‌ మ్యాచ్‌లో ఆయ‌న ఈ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తాడు. ఇంగ్లండ్‌ తో జరగనున్న మొదటి వార్మప్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ గా ధోనీని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తూ భారత్‌ ‘ఎ’ జట్టుకు ఆయ‌నే సార‌థ్యం వహిస్తాడని తెలిపింది. ఇక‌ ఇంగ్లండ్‌ తో జరగనున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో అజింక్య రహానే కెప్టెన్‌ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తాడు.

మొదటి వార్మప్‌ మ్యాచ్‌ కు భారత్‌ ‘ఎ’ జట్టులో ధోనీతో పాటు ధావన్‌, మన్‌దీప్, రాయుడు, హార్ధిక్‌ పాండ్యా, సంజూ శామ్సన్‌, కుల్దీప్‌, యువరాజ్‌, యాదవ్‌, చాహల్‌, నెహ్రా, మొహిత్‌ శర్మ, సిద్ధార్థ కాల్ ఉన్నారు. ఇక రెండో వార్మప్‌ మ్యాచ్ లొ భారత్‌ ‘ఎ’ జట్టులో రహానేతో పాటు షెల్డాన్‌ జాక్సన్‌, వి.శంకర్‌, నదీం, పంత్‌, రైనా, దీపక్‌ హుడా, ఇషాన్‌ కిషన్, పర్వేజ్‌ రసూల్‌, వినయ్‌ కుమార్‌, పదీప్‌ సాంగ్‌వాన్‌, అశోక్‌ దిండా ఉన్నారు.

More Telugu News