accident: ఐదు కార్ల‌ను ఢీకొన్న కారు... త‌ప్పిన‌ భారీ ప్రాణ నష్టం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, ఎస్జీ రోడ్డులోని జల్సా పార్టీ ప్లాట్‌కు సమీపంలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న ఐదు కార్లవైపుకి దూసుకెళ్లింది. దీంతో ఆ ఐదు కార్లు ధ్వంస‌మ‌య్యాయి. ఈ ప్ర‌మాదం జ‌రిగే స‌మ‌యంలో ఆ స్థలంలో ధ‌ర్మేంద్ర అనే యువ‌కుడు త‌ప్పా ఎవరూ లేక పోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్ర‌మాదానికి గుర‌యిన‌ ఆ యువ‌కుడు ఎగిరి పక్కనే ఉన్న కార్ల‌పై ప‌డ్డాడు. ఈ దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాల్లో నిక్షిప్త‌మ‌య్యాయి.

కారు వేగంగా వ‌చ్చి ఒక్క‌సారిగా ఇత‌రకార్ల‌ను ఢీ కొట్ట‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ కారులో ఓ డ్రైవర్ తో పాటు ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ప్రమాదానికి కారణమైన కారు కచ్‌ ఆర్టీవో పరిధిలో ఉన్నట్లు స‌మాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News