shahid kapoor: 20 మంది ఫొటోగ్రాఫర్లు వెంట‌ప‌డ్డారు.. పాప కళ్లు దెబ్బతినవా?: ట‌్విట్ట‌ర్‌లో బాలీవుడ్ హీరో ఆగ్ర‌హం

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కొన్ని నెల‌ల క్రితం తండ్రి అయిన విష‌యం తెలిసిందే. త‌న‌కు పండంటి పాప పుట్టింద‌ని ఆయన అప్ప‌ట్లో త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు. అయితే, అదే ట్విట్ట‌ర్ లో ఇప్పుడు ప‌లువురు ఫొటోగ్రాఫ‌ర్ల‌పై స‌ద‌రు హీరో మండిప‌డ్డాడు. షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ దంప‌తులు త‌మ‌ పాపకి మిషా కపూర్ అనే పేరు పెట్టారు. అయితే, త‌మ పాప‌ను బ‌య‌ట‌కు తీసుకొస్తున్న వేళ సుమారు 20 మంది ఫొటోగ్రాఫర్స్ ఆమెను తమ కెమెరాలో బంధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారట‌.

షాహిద్ మాత్రం తన కూతురు క‌న‌ప‌డ‌కుండా క్లాత్ తో మొత్తం కవర్ చేశాడు. తన కూతురిని ఇప్ప‌ట్లో బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి అసలు ఇష్టపడని ఆయ‌న.. ఫొటోగ్రాఫర్లపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. 'ఒకేసారి అంతమంది ఫొటోగ్రాఫర్స్ త‌న పాపను రెండడుగుల దూరం నుంచి అన్ని ఫోటోలు తీస్తే పాప కళ్లు దెబ్బతింటాయన్న జ్ఞానం కూడా లేదా?' అంటూ ట్విట్ట‌ర్‌లో మండిప‌డ్డాడు. ప్రస్తుతం షాహిద్ క‌పూర్‌ 'రంగూన్' అనే మూవీలో న‌టిస్తున్నాడు.




More Telugu News