: అల్ బదర్ కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం

పాక్ కేంద్రంగా ఉగ్రవాద చర్యలకు దిగుతున్న లష్కరే తోయిబాతో సన్నిహత సంబంధాలు నడుపుతున్న మరో ఉగ్రసంస్థ అల్ బదర్ కు చెందిన కీలక ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది. జమ్ములోని బుద్గామ్ జిల్లా మచ్చు ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో, ఈ తెల్లవారుఝామున ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది.

భద్రతా దళాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగగా, సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ ఘటనలో అల్ బదర్ కు చెందిన ముజఫర్ అహ్మద్ హతమయ్యాడు. ఈ ఘటనలో ఒక జవానుకు గాయాలు అయినట్టు సైనికాధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంకొంతమంది ఉగ్రవాదులు ఉండవచ్చన్న సమాచారంతో గాలింపు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News