: రివాల్వర్ అప్పగించిన తెలుగుదేశం నేత రావి

రెన్యువల్ కాని రివాల్వర్ ను బయటకు తెచ్చి చూపడమే కాకుండా, గాల్లోకి కాల్పులు జరిపి హల్ చల్ చేసిన తెలుగుదేశం నేత, గుడివాడ నియోజకవర్గ ఇన్ చార్జ్ రావి వెంకటేశ్వరరావు తన రివాల్వర్ ను పోలీసులకు సరెండర్ చేశారు. పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్ వద్ద ఆయన కాల్పులకు పాల్పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు రాగా, వన్ టౌన్ పోలీస్ స్టేషనుకు వచ్చిన ఆయన రివాల్వర్ ను అప్పగించారు. కాగా, ఈ రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ కాలేదని తెలుస్తుండగా, రెన్యువల్ కోసం తాను దరఖాస్తు చేశానని రావి తెలిపారు. ఇక దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నామని, నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

More Telugu News