: ఢిల్లీ ‘మెట్రో’ స్టేషన్ లో ఎస్ఐ ఆత్మహత్య

ఢిల్లీలోని మెట్రో రైల్వే స్టేషన్ లో సీఐఎస్ఎఫ్ ఎస్ఐ భగత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు సాయంత్రం రైల్వేస్టేషన్ లోని సీసీ టీవీ కంట్రోల్ రూమ్ లో తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, 2012లో సీఐఎస్ఎఫ్ లో చేరిన భగత్ సింగ్ ఆగ్రా వాసి అని, వివాహితుడని తెలిసింది. 

More Telugu News