: జగన్ ఓదార్పు రైతులకు, ప్రజలకు అవసరం లేదు: మంత్రి ప్రత్తిపాటి

వైఎస్సార్సీపీ అధినేత జగన్  ఓదార్పు రైతులకు, ప్రజలకు అవసరం లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఎవరి కోసం ఈ ఓదార్పు యాత్రలు చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు.
ప్రజల ఆలోచనలకు భిన్నంగా జగన్ ఓదార్పుయాత్ర  చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ సాధ్యం కాదన్న జగన్ మాటలు తప్పని  చంద్రబాబు నిరూపించారన్నారు. జగన్ తాను దోచుకున్న డబ్బును ప్రజలకు ఇస్తే చాలా సంతోషిస్తారని ప్రత్తిపాటి సెటైర్ వేశారు.

More Telugu News