kiran bedi: పుదుచ్చేరి సీఎం ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేసిన కిర‌ణ్ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌ బేడి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, రాష్ట్రంలోని అధికారుల‌ను ఆమె ప‌రుగులు పెట్టించి ప‌నులు చేయిస్తున్నారు. అయితే, ఆమె తాజాగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ వి.నారాయణస్వామి జారీ చేసిన ఓ ఆదేశాన్ని సైతం ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అధికారిక కార్యకలాపాల కోసం సామాజిక మాధ్య‌మాల‌ను వినియోగించకుండా నిషేధం విధిస్తూ ఇటీవ‌లే నారాయణస్వామి ఆదేశాలు జారీచేశారు. అయితే ఆ ఆదేశాలు చెల్లవని కిరణ్‌ బేడీ తేల్చి చెప్పేశారు. పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యం టెక్నాల‌జీ అందుబాటులో లేని రోజుల్లోకి మ‌న‌ల్ని తీసుకెళ్లేలా ఉంద‌ని, అందుకే ఆయ‌న ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేశాన‌ని, ఇది పుదుచ్చేరి అభివృద్ధికి ఆటంక‌మ‌ని ఆమె ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.



More Telugu News