: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 245 పాయింట్ల అప్!

అంతర్జాతీయంగా అనుకూల పవనాలు వీయడం, ఆటో, మెటల్, బ్యాంకింగ్ కంపెనీల స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతు లభించడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు ఎగబాకి 26,878కి చేరింది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 8,274కు చేరుకుంది.

ఈనాటి టాప్ గెయినర్స్... జస్ట్ డయల్ (14.80%), జైప్రకాశ్ అసోసియేట్స్ (7.88%), జేఎస్డబ్ల్యూ స్టీల్ (7.79%), యూనిటెక్ (6.97%), గుజరాత్ మినరల్స్ డెవలప్ మెంట్ (6.16%).

టాప్ లూజర్స్...
చోళమండలం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్ (-3.31%), శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ (-2.86%), టెక్ మహీంద్రా (-2.28%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (-2.22%), సనోఫి ఇండియా (-2.10%).    

More Telugu News