: సుందర్ పిచాయ్ అభిమాన హీరోయిన్ ఎవరో తెలుసా?

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నిన్న ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులతో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు. పిచాయ్ కూడా 1993లో ఖరగ్ పూర్ ఐఐటీలోనే మెటలర్జికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత బిజినెస్ వార్టన్ స్కూల్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులతో పిచాయ్ మాట్లాడుతూ, రాత్రుళ్లు మేల్కొని బాగా చదువుతుండటంతో, మరుసటి రోజు క్లాసులకు వెళ్లలేక పోయేవాడినని చెప్పారు. హాస్టల్ ఫుడ్ పప్పా? సాంబారా? అని చూసేవాడినని తెలిపారు. తనకు హిందీ బాగా రాదని అన్నారు. తాను కంప్యూటర్ ను తొలిసారి ఇక్కడే చూశానని చెెప్పారు. తనకు ఇష్టమైన హీరోయిన్ దీపికా పదుకొనే అని, ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని తెలిపారు.

More Telugu News