supreme court: పశ్చిమ బెంగాల్ సర్కారుకు మరో షాక్.. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు

పశ్చిమబెంగాల్ ప్ర‌భుత్వం మ‌రిన్ని చిక్కులు ఎదుర్కుంటోంది. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో ఆ రాష్ట్ర అధికార‌ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ ఇటీవ‌లే అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ రోజు మ‌రో కేసులో పశ్చిమబెంగాల్ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకుంది. అధికారాల బదిలీకి సంబంధించి గుర్ఖాల్యాండ్ టెర్రిటోరియల్ అడ్మినిస్ట్రేటివ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్ర‌భుత్వం సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News