: బెంగళూరు కీచకపర్వం... ముగ్గురు అమ్మాయిలపై 30 మంది దాడి!

కొత్త సంవత్సర వేడుకల్లో ఇండియన్ సిలికాన్ వేలీ బెంగళూరులో చోటు చేసుకున్న కీచకపర్వం యావత్ దేశాన్ని కుదిపివేసింది. సరిగ్గా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన సమయంలో బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్ లలో పలువురు అమ్మాయిలు కొందరు అల్లరి మూకల చేతుల్లో నలిగిపోయారు. పోలీసుల భద్రత ఉన్నా, వారిని రక్షించే వారు మాత్రం కరువయ్యారు. ఈ నేపథ్యంలో, ఓ దారుణ విషయం వెలుగు చూసింది.

ఓ ప్రత్యక్ష మహిళా సాక్షి ఆ రోజు తాను చూసిన దారుణాన్ని వెల్లడించింది. ఆమె ఏమి చెప్పిందో ఆమె మాటల్లోనే చూద్దాం. "బ్రిగేడ్ రోడ్ జంక్షన్ లోని రెసిడెన్సీ రోడ్ లోని ఓ హోటల్ లో లిమిటెడ్ ఎడిషన్ ఈవెంట్ ను నిర్వహించారు. అర్ధరాత్రి అయిపోయింది. పని పూర్తి చేసుకుని బయటకు వచ్చాను. నా కారు వద్దకు చేరుకోవడానికి వెళుతున్నాను. ఇంతలో అమ్మాయిల అరుపులు వినిపించాయి. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. వారి వెంట 30 మంది మగవారు వెంటపడుతున్నారు. అమ్మాయిలను పట్టుకుని చాలా దారుణంగా ప్రవర్తించారు. వారి ప్రవర్తనను మాటల్లో వర్ణించలేను, నేను వెంటనే హోటల్ లోకి వెళ్లి బౌన్సర్లను వెంటపెట్టుకొచ్చాను. ఆ తర్వాత దారుణంగా ప్రవర్తిస్తున్న వారిని హెచ్చరించాం. పోలీసులను పిలుస్తామని బెదిరించాం. బౌన్సర్లను చూసి అవతలి వారు తగ్గారు" అని తెలిపింది.

More Telugu News