: ‘ఈనాడు’ రామోజీరావుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. వెన్నునొప్పు, వైరల్ ఫీవర్, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని, బుధవారం కొద్దిగా ఆహారం కూడా తీసుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఏమ్వీ రావు, పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీత్సాగర్ బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నాయి.