court: అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపిన కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు!

విజయవాడలో 2014వ‌ సంవత్సరం ఆగస్టు 23న వెలుగులోకి వచ్చిన ‘మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపిన కేసు’లో ఐదుగురు యువ‌కుల‌ను దోషులుగా తేల్చిన విజ‌య‌వాడ కోర్టు.. ఈ రోజు వారికి శిక్ష‌ను విధిస్తూ సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న‌ నిమ్మకూరి సాయిరామ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది. ఈ కేసులో దీపక్‌, అభిలాష్‌, మున్నాలకు 20 ఏళ్ల చొప్పున శిక్ష విధిస్తున్న‌ట్లు, దోషిగా తేలిన‌ మరో మైన‌ర్ బాలుడికి మూడేళ్ల జైలు శిక్ష ఖ‌రారు చేసిన‌ట్లు తెలిపింది.

విజయవాడకు చెందిన ఈ ఐదుగురు యువకులు కొంతమంది అమ్మాయిల‌కు మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. అంతేగాక‌, ఈ దారుణం జ‌రుపుతుండ‌గా తీసిన‌ వీడియాలను సామాజిక మాధ్య‌మాల్లో సైతం పోస్ట్‌ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఐదుగురినీ అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి, న్యాయ‌స్థానంలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన అనంత‌రం ఈ రోజు కోర్టు శిక్ష‌లు ఖ‌రారు చేస్తూ తీర్పుచెప్పింది.

More Telugu News