: ‘ఫీజు రీయింబర్స్ మెంట్’ స్కీమును యథావిధిగా కొనసాగిస్తాం: సీఎం కేసీఆర్

ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం యథావిధిగా కొనసాగుతుందని, విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోను ఇబ్బంది కలగనివ్వమని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ ఈ పథకానికి ఏడాదికి రూ.2,500 కోట్లు అవసరమని, విద్యార్థుల సంఖ్య మేరకు రీయింబర్స్ మెంట్ నిధులు పెంచుతామని అన్నారు. గత ఏడాది రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని, ఇందు నిమిత్తం రూ.1400 కోట్లు చెల్లించామని కేసీఆర్ పేర్కొన్నారు.  

More Telugu News