: సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు... స్వాగతం పలుకుదాం: క్రిష్

ఈ సంక్రాంతికి 'ఖైదీ నంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతోంది. మరోవైపు 'ఖైదీ' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వేదిక కూడా దొరక్కపోవడం వేడిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో వివాదాలకు ముగింపు పలికేందుకు దర్శకుడు క్రిష్ ప్రయత్నించాడు.

"ఈ సంక్రాంతికి మనల్ని ఆనందింపజేయడానికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు. వారిద్దరికీ స్వాగతం పలుకుదాం" అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, 'ఖైదీ' జనవరి 11న, 'గౌతమీపుత్ర' జనవరి 12న వస్తున్నాయంటూ పోస్ట్ చేశాడు. 

More Telugu News