: చంద్రబాబు పర్యటన వేళ..జిలెటిన్ స్టిక్స్ కలకలం!

అనంతపురం జిల్లా బుక్కపట్నంలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈరోజు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణించే మార్గంలో బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. పుట్టపర్తి-బుక్కపట్నం మార్గంలో కాలం చెల్లిన రెండువందల జిలెటిన్ స్టిక్స్ ను గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, హంద్రీనీవా కాలువ తవ్వకంలో పేలుళ్లకు ఉపయోగించే నిమిత్తం వీటిని తీసుకువచ్చారని, మిగిలిపోయిన జిలెటిన్ స్టిక్స్ ను ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. కాగా, కొద్దిసేపటి క్రితం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు, అక్కడి నుంచి బుక్కపట్నంకు బయలుదేరారు.

More Telugu News