: వేలల్లో ఉండే నక్సలైట్లు వందలకు చేరారు: ఏపీ డీజీపీ

గతంలో వేల సంఖ్యలో ఉండే మావోయిస్టు నక్సలైట్లు నేడు వందల సంఖ్యకు చేరారని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. గుంటూరు జిల్లా కేంద్రంలో మోడల్ పోలీస్‌ స్టేషన్‌ లను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏపీలో మావోయిస్ట్‌ ల ప్రభావాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్న నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసులు ఆదర్శంగా పని చేయాలని సూచించిన ఆయన, అలా పని చేస్తేనే పోలీసులపై నమ్మకం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

More Telugu News