: జానారెడ్డికి హరీష్ రావు సరదా పంచ్... అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన!

తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రతి పక్ష నేత జానారెడ్డిపై మంత్రి హరీశ్‌ రావు సరదా పంచ్ వేయడం ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ లాబీల్లో మంత్రి హరీశ్‌ రావు ప్రతిపక్ష నేత జానారెడ్డికి ధర్మపురి ఆలయ కమిటీ సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పూజారులు జానారెడ్డిని దీవించారు. ఈ సందర్భంగా మధ్యలో హరీష్ రావు కల్పించుకుని 'మీరెప్పుడూ ఇలాగే ప్రతిపక్ష నేతగా ఉండాలి' అంటూ హరీశ్‌ రావు సరదాగా పంచ్ వేశారు. దానికి జానారెడ్డి నవ్వుతూ 'అప్పటికి ఎవరుంటారో పరిస్థితులను బట్టి డిసైడ్‌ అవుతుంది' అన్నారు. దీంతో అక్కడున్నవారు కూడా నవ్వేశారు. 

More Telugu News