: '24కే' పిజ్జా... ఇది చాలా కాస్ట్ లీ గురూ!

ఒకప్పుడు రుచికరమైన వంటకాలు తినేవారు... ఇప్పుడు ఖరీదైన వంటకమే రుచికరమైనదనే సిద్ధాంతం చాలా మందికి వంటబట్టింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఓ రెస్టారెంట్ అత్యంత ఖరీదైన పిజ్జాను రుచికరంగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పిజ్జా ఖరీదు ఎంతంటే... కేవలం లక్షా 30 వేల రూపాయలే! ఇంత ఖరీదైన పిజ్జాలో ఏముంటుందన్న అనుమానం వచ్చిందా? ఈ పిజ్జాలో 24 కేరట్ల బంగారం రేకులు, ఎండబెట్టిన అరుదైన జాతికి చెందిన చేపముక్కలు, అమెరికన్లకు నోరూరించే ఓ రకం దుంపతో దీనిని తయారు చేస్తారు.

ఇది తినాలంటే కూడా రెండు రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలని న్యూయార్క్ లోని ఇండస్ట్రీ కిచెన్ రెస్టారెంట్ చెబుతోంది. పిజ్జా చాలా రుచికరంగా ఉంటుందని ఈ రెస్టారెంట్ భరోసా ఇస్తోంది. అయితే ఈ పిజ్జాపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్... ఇలాంటి పిజ్జాను తాను కొనుగోలు చేస్తే... అందులోని బంగారం రేపర్లు తీసి, బంగారం షాపులో అమ్మేసి, పిజ్జాను దగ్గర్లోని ఆకలితో ఉన్న బాలుడికి ఇస్తానని పేర్కొనగా, మరో నెటిజన్ ఇది చూడడానికి బాగున్నంతగా తినడానికి ఉండదని భావిస్తున్నానని పేర్కొనడం విశేషం. 

More Telugu News