: ఆన్ లైన్ లో సిలెండర్ బుక్ చేస్తే 5 రూపాయల తగ్గింపు!

పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటలైజేషన్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గృహ వినియోగదారులను ఆన్ లైన్ సేవలు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్‌ రీఫిల్‌ ను ఆన్‌ లైన్‌ లో బుక్ చేసి పేమెంట్ చేస్తే సిలెండర్ పై 5 రూపాయలు తగ్గించనున్నట్టు ప్రకటించాయి. వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా సంబంధిత గ్యాస్ సంస్థల వెబ్‌ సైట్ల నుంచి గ్యాస్ సిలిండర్ రీఫిల్‌ ను ఆన్‌ లైన్ లో బుక్ చేసుకోవచ్చని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

More Telugu News