: మహిళలు ఎంత కురచ దుస్తులు ధరిస్తే అంత ఫ్యాషన్ అయిపోయింది!: సమాజ్ వాదీ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరులో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన సంఘటనపై ఆ రాష్ట్ర మంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా, సమాజ్ వాదీ పార్టీ నేత అబూ అజ్మీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఈ సంఘటనపై మీడియా ముందు ఆయన ప్రస్తావిస్తూ, అమ్మాయిలను వేధింపులపాలు చేయడం దారుణమని, ఆకతాయిలపై  కచ్చితంగా కేసు పెట్టి విచారణ చేపట్టాల్సిందేనని అన్నారు. అయితే, ఈ కాలంలో మహిళలు ఎంత కురచగా దుస్తులు ధరిస్తే అంత ఫ్యాషన్ గా, ఆధునికురాలిగా, విద్యావంతులమని భావిస్తున్నారని, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తిరగడం తప్పంటే 'మాకు నాగరికత తెలియదా?' అని ప్రశ్నిస్తారని ఆయన ఆరోపించారు. మన సంస్కృతికి మచ్చగా మారిన ఈ ధోరణి బాగా పెరిగిపోయిందని అబూ అజ్మీ మండిపడ్డారు.

More Telugu News