: 'ఉచితం' పొడిగిస్తున్నామంటూ జియో మెసేజ్ రాలేదా?... అయినా డోంట్ వర్రీ అంటున్న రిలయన్స్

మీరు రిలయన్స్ జియో కస్టమర్లా? "మార్చి 31 వరకూ ఉచిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు" అంటూ మీకు రిలయన్స్ జియో నుంచి మెసేజ్ రాలేదా? అయినా కంగారుపడవలసిన పనిలేదు. ఉచిత ఆఫర్ పై మెసేజ్ రాకున్నా ఆఫర్ కొనసాగుతుందని కస్టమర్లకు రిలయన్స్ జియో స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా)కు వివరణ ఇస్తూ, తామందించిన ప్రమోషనల్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ వేరువేరని తెలిపింది. డిసెంబర్ 31 వరకూ ఇచ్చిన ఉచిత ఆఫర్ కు తాజా ఆఫర్ కొనసాగింపు కాదని ప్రకటించింది. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమందికి మెసేజ్ వెళ్లలేదని, కంగారు అక్కర్లేదని, మరో 90 రోజులు ఉచిత సేవలను అందుకోవచ్చని, వినియోగించిన డేటాకు బిల్లు పంపుతున్నట్టు వచ్చిన ఆరోపణలు నిజం కాదని వివరణ ఇచ్చింది.

More Telugu News