: వేదిక ఎందుకు మార్చారో చిరంజీవే చెబుతారు: అల్లు అరవింద్

చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లను నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఫంక్షన్ కు అనుమతులు వచ్చాయని చెప్పారు. అయితే, వేదికను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న విషయాన్ని చిరంజీవే వివరిస్తారని తెలిపారు. మరోవైపు, దురుద్దేశంతోనే ఖైదీ వేడుకకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News