: చంద్రబాబు అపర భగీరథుడు.. అంటూ సినిమా డైలాగ్ చెప్పిన ఉప ముఖ్యమంత్రి కేఈ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అపర భగీరథుడు అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొనియాడారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఎగువన నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సోమవారం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ గన్ ఎప్పుడు పేల్చామన్నది కాదని.. బుల్లెట్ ఎక్కడ దిగిందన్నదే ముఖ్యమని ఓ సినిమాలో డైలాగ్ ఉందని, అదే తరహాలో చంద్రబాబు నీళ్లిస్తూ బుల్లెట్లా దూసుకుపోతున్నారని కేఈ అన్నారు. జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు దృఢ సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తారని అన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చాలన్నదే చంద్రబాబు లక్ష్యమని దేవినేని పేర్కొన్నారు.