sushma swaraj: విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండలేను: సుష్మాస్వరాజ్‌

ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్ర‌స్తుతం త‌న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎన్నో అంశాల‌పై స్పందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె అభిమాని ఒక‌రు ట్విట్ట‌ర్ ద్వారా ఆమెను ప్రశ్నించారు. ప్ర‌స్తుతం పూర్తిగా కోలుకున్నారా? లేక ఇంకా చికిత్స జరుగుతోందా? అని, తమకు ఆందోళనగా ఉందని, ఆమె ప్రతి విషయంపై ఎలా స్పందిస్తుంటారని, విశ్రాంతి తీసుకోవాల‌ని ట్వీట్‌ చేశారు. త‌న ఫాలోవ‌ర్ చేసిన ట్వీటుకు స్పందించిన సుష్మ స్వరాజ్ తాను ఇంకా చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ  తాను విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండలేనని చెప్పారు. ఏ ప‌ని చేయ‌కుండా విశ్రాంతి తీసుకోవడం త‌న‌కు సరిపడదని, పనిచేయాల్సిందేన‌ని జ‌వాబు ఇచ్చారు.


More Telugu News