: బీసీసీఐ కొత్త బాస్ 'గంగూలీ'?

బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ను ఆ పదవి నుంచి తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుకు తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. లోథా కమిటీ సిఫారసుల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారు ఈ పదవిని చేపట్టడానికి అనర్హులు.

భారత క్రికెట్లో ఐదు జోన్లు ఉన్నాయి. మూడేళ్లకోసారి రొటేషన్ పద్ధతిలో బీసీసీఐ చీఫ్ ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఈస్ట్ జోన్ కు చెందిన టర్మ్ నడుస్తోంది. అనురాగ్ ఠాకూర్ తన పదవిని కోల్పోవడంతో... ఈస్ట్ జోన్ నుంచే మరో వ్యక్తిని ఎన్నుకోవాల్సి ఉంది. అనురాగ్ కంటే ముందు శశాంక్ మనోహర్ ఈస్ట్ జోన్ నుంచే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఐసీసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఈస్ట్ జోన్ నుంచి అధ్యక్ష పదవిని అధిరోహించగల వ్యక్తి ఎవరా? అని వెతికితే... డేరింగ్ అండ్ డ్యాషింగ్ సౌరవ్ గంగూలీనే కనిపిస్తున్నాడు.  అంతులేని క్రికెట్ అనుభవంతో పాటు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న గంగూలీకీ బీసీసీఐ బాస్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గౌతమ్ రాయ్, టీఎస్ మాథ్యూలాంటి సమర్థులు ఉన్నప్పటికీ... వారు వెస్ట్ జోన్ కు చెందినవారు కావడంతో, గంగూలీకి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. 

More Telugu News