: దేవాలయాలను ఉచితంగా దర్శించుకునే 'దివ్యదర్శనం' పథకం వివరాలు!

పేద హిందువులు రాష్ట్రంలోని 8 ప్రముఖ ఆలయాలను ఉచితంగా దర్శించుకునేందుకు ఉద్దేశించిన 'దివ్యదర్శనం' పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం విజయవాడలో ప్రారంభించారు. ఈ పథకం వివరాలు ఇవి.

* ఏపీలోని 8 ప్రముఖ ఆలయాలను ఉచితంగా సందర్శించుకోవచ్చు.
* రేషన్ కార్డు ఉంటే చాలు. ఈ పథకం కింద ఉచిత ప్రయాణం, వసతి, భోజనం, దైవ దర్శనం కల్పిస్తారు.
* ప్రతి జిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది.
* భక్తులను తమ ఇంటికి వచ్చిన అతిథులుగా దేవాదాయ శాఖ చూసుకోవాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. 

More Telugu News