: 2017లోనైనా మారండి... మోదీపై విజయ్ మాల్యా విసుర్లు

రైతులు కూడా టెక్నాలజీని వాడాలని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు సాంకేతికను వాడుకునేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని యూబీ గ్రూప్ మాజీ అధిపతి, బ్యాంకులకు రూ. 9,400 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణల్లో సాంకేతికతను వాడుకుని నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతిని అంతం చేసేందుకు కృషి చేశానని చెప్పుకునే మోదీ, తన నియంత్రణలోని సంస్థలు న్యాయబద్ధంగా, అవినీతిరహితంగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు.

More Telugu News