: గుడివాడ మున్సిపల్ సమావేశం ... టీడీపీ-వైఎస్సార్సీపీ సభ్యుల ఫైటింగ్

కృష్ణా జిల్లాలోని గుడివాడ మున్సిపల్ సమావేశం ప్రారంభంలోనే టీడీపీ, వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య  మొదలైన గొడవలు..ఆందోళనకు దారి తీయడమే కాకుండా పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి 10 మంది కౌన్సిల్ సభ్యులతో యలవర్తి శ్రీనివాసరావు ఇటీవల టీడీపీలోకి వెళ్లారు. దీంతో, గుడివాడ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకున్న తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. అయితే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సహా ఆ పార్టీ కౌన్సిలర్లు, ఈ సమావేశానికి వస్తున్న చైర్మన్ కు అడ్డుపట్టారు. దీంతో, రెండు పార్టీలకు చెందిన వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరకు రెండు పార్టీల కౌన్సిలర్లు పరస్పరం దాడులకు దిగారు. దీంతో, సమావేశం నిర్వహించడం సాధ్యపడకపోవడంతో వాయిదా పడింది. కాగా, పోలీసులు ఇరువర్గాల వారిని అడ్డుకున్నారు.

More Telugu News