accident: కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 9 మంది మృతి.. పది మందికి తీవ్ర గాయాలు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సీతాపూర్ గుండా వెళుతున్న ఓ బ‌స్సు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పడంతో అక్క‌డి శార‌ద‌ కాలువ‌లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ప‌ది మందికి తీవ్ర‌ గాయాల‌య్యాయి. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాయాల‌పాల‌యిన‌ వారిని చికిత్స నిమిత్తం ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి తరలించారు. సహాయక చర్యలు కొన‌సాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News