gold seize: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో ఈ రోజు సోదాలు నిర్వ‌హిస్తోన్న క‌స్ట‌మ్స్ సిబ్బంది ముగ్గురు ప్ర‌యాణికుల‌ నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. జడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఈ ముగ్గురిని త‌నిఖీ చేయ‌గా వారి వద్ద 1.2 కిలోల బంగారం ప‌ట్టుబ‌డింద‌ని మీడియాకు తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు.

More Telugu News