: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా

పోర్ట్ ఎలిజబెత్ లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక జట్టును దక్షిణాఫ్రికా 206 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో సౌతాఫ్రికా 1-0 తేడాతో ముందడుగు వేసింది. చివరి రోజు కేవలం 41 పరుగులు మాత్రమే చేసిన శ్రీలంక చివరి 5 వికెట్లను కోల్పోయింది. మొత్తం మీద 281 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక జట్టులో మ్యాథ్యూస్ 59, మెండిస్ 58, కౌశల్ సిల్వా 48, కరుణరత్నే 43 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబదా, కేశవ్ మహరాజ్ చెరో 3 వికెట్లు తీయగా... అబాట్ 2, ఫిలాండర్ ఒక్క వికెట్ తీశారు.

స్కోరు వివరాలు:దక్షాణాఫ్రికా 286 & 406/6డిక్లేర్
శ్రీలంక 205 & 281
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్టీఫెన్ కుక్ (59 & 117) ఎంపికయ్యాడు. 

More Telugu News