myntra offer: న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆన్‌లైన్ షాపింగ్ సైట్ మింత్రా

ఆన్‌లైన్ షాపింగ్ సైట్ మింత్రా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌మ క‌స్ట‌మ‌ర్ల ముందుకు భారీ ఆఫ‌ర్‌ను తీసుకురానుంది. 'ఎండ్ ఆఫ్ రీజన్' సేల్ పేరిట వ‌చ్చే జనవరి 3వ తేదీ నుంచి 5 వ‌ర‌కు 1,800 బ్రాండులకు చెందిన షూస్, క్లాత్స్ వంటి అన్ని ఫ్యాషన్ వస్తువులను 50 నుంచి 80 శాతం డిస్కౌంట్తో విక్ర‌యించ‌నున్న‌ట్లు పేర్కొంది. న‌గ‌దుర‌హిత లావాదేవీల ద్వారా కొనుగోలు చేసేవారికి ఆ డిస్కౌంట్ శాతం మ‌రింత ఎక్కువ‌గా అందిస్తామ‌ని తెలిపింది. ఈ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చి తమ అమ్మకాల‌ను మ‌రింత పెంచుకోవాల‌ని చూస్తోంది. దేశంలో పెద్ద‌నోట్ల ర‌ద్దుతో త‌గ్గిపోయిన అమ్మ‌కాల‌ను ఈ భారీ డిస్కౌంట్ ద్వారా మ‌ళ్లీ పుంజుకునేలా చేసుకోవాల‌ని యోచిస్తోంది.

మింత్రా సైటు యజమాన్య సంస్థ అయిన‌ ఫ్లిప్కార్ట్కు ఈ ఆఫ‌ర్ లాభాల‌ను తెచ్చిపెడుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. న‌వంబ‌రు 8 త‌రువాత ఫ్లిప్కార్ట్ వృద్ధి రేటు 50 శాతం మేర ప‌డిపోయింది. త‌మ సంస్థ‌ సాధారణ రోజుల కంటే ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ ఈవెంట్లో త‌మ విక్ర‌యాల‌ను ఎన్నో రెట్లు అధికం చేసుకుంటామ‌ని, ఈ ఈవెంట్‌ను ఏడాదికి రెండు సార్లు నిర్వ‌హిస్తామ‌ని మింత్రా సీఈవో ఆనంత్ నారయణన్ చెప్పారు. ఈ ఏడాది జులైలోనూ ఈవెంట్‌ను నిర్వహించామ‌ని, అయితే, ఇప్పుడు దానికంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తామని అన్నారు. ఈ ఈవెంట్ లో 15 మిలియన్ ప్రజలు కొనుగోళ్లు చేస్తార‌ని, 5 నుంచి 6 లక్షల మ‌ధ్య‌ కొత్త కస్టమర్లను పొందుతామని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News