rail: గర్భవతైన ప్రియురాలిని రైలు నుంచి బయటకు నెట్టేసిన ప్రియుడు!

కోల్‌క‌తాలోని మాల్దా రైల్వే స్టేషన్ ప‌రిధిలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మాల్దా నుంచి శంసీ స్టేషన్‌కు వెళుతున్న కతిహార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్య‌క్తి గర్భవతైన తన ప్రియురాలిని రైలు నుంచి బయటకు నెట్టేశాడు. ఆ స‌మ‌యంలో ఆమె చేసిన ఆర్తనాదాలు విన్న రైల్వే పోలీసు అధికారులు రైల్వే పట్టాలపై ఆమె ప‌డి ప్రాణాపాయ స్థితిలో ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అయితే, బాధితురాలు కుడి చేయి కోల్పోయిందని, తీవ్ర రక్తస్రావం జ‌ర‌గ‌డంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఈ విష‌యాన్ని తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు తమ కుమార్తె అహిమ్ అనే వ్యక్తితో ప్రేమ‌లో ఉంద‌ని చెప్పారు. గ‌ర్భంతో ఉన్న‌ త‌మ కుమార్తె అహిమ్‌ను పెళ్లి చేసుకోమ‌ని అడిగితే అత‌డు ఒప్పుకోలేద‌ని, ఈ నేప‌థ్యంలో అతడిపై తాము కేసు పెట్టామ‌ని చెప్పారు. దీంతో అత‌డు పెళ్లికి ఒప్పుకున్నాడని, ఇటీవ‌లే తమ కుమార్తెను బయటకు వెళదామ‌ని తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడ‌ని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, స‌ద‌రు నిందితుడిపై ఇది వ‌ర‌కు మ‌రో కేసు కూడా ఉంద‌ని, ఆ కేసులోనూ అత‌డిని గాలిస్తున్నామ‌ని చెప్పారు.

More Telugu News