: మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 31న జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశాలున్నట్టు సమాచారం. నవంబర్ 8న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నోట్లను తమ ఖాతాల్లో జమ చేసుకునేందుకు ప్రజలకు ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ మరుసటి రోజు ప్రధాని మరోసారి ప్రజలకు తన సందేశం వినిపించనున్నట్టు అధికార వర్గాలను బట్టి తెలుస్తోంది.

ఈ ప్రసంగం సందర్భంగా ప్రధాని ఏం ప్రకటిస్తారు...? ఇన్నాళ్లూ తగినంత నగదు లభించక ఎంతో ఇబ్బంది పడిన ప్రజలకు వరాలు ఏవైనా కురిపిస్తారా...? అన్న ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ చర్యను సామాన్యులు సైతం తప్పుబట్టిన నేపథ్యంలో ప్రధాని ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

More Telugu News