: నీకు అంత దమ్ముందా?: కేజ్రీవాల్ కు అమరీందర్ సింగ్ సవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ సవాల్ విసిరారు. దమ్ముంటే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో నేతలంతా ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, అమరీందర్ లక్ష్యంగా కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అమరీందర్, అతని సోదరుడు కీలకమైన నేతలపై పోటీకి దిగుతున్నారా? లేక సురక్షిత స్థానాల నుంచి పోటీ చేస్తున్నారా? అంటూ కేజ్రీ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే, కేజ్రీవాల్ కు అమరీందర్ సవాల్ విసిరారు. దమ్ముంటే పంజాబ్ లో కేజ్రీవాల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పాలని... ఆయనపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని అన్నారు. 

More Telugu News