kakani: మొదట దేశంలో ఉన్న ఆస్తులపై వివరణ ఇవ్వండి: సోమిరెడ్డిపై మరోసారి ఆరోపణలు గుప్పించిన కాకాని

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరోసారి సోమిరెడ్డిపై విరుచుకుపడ్డారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. విదేశాల్లో సోమిరెడ్డికి ఉన్న‌ ఆస్తుల సంగతిని పక్కన పెట్టి, మొద‌ట‌ దేశంలో ఆయ‌న‌కు ఉన్న‌ ఆస్తులపై  వివరణ ఇవ్వాలని అన్నారు. సోమిరెడ్డికి అక్ర‌మాస్తులు ఉన్నాయ‌ని తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాకాని స‌వాలు విసిరారు.

సోమిరెడ్డి ఆస్తులకు సంబంధించిన ఆధారాలంటూ మ‌రికొన్ని ప‌త్రాల‌ను ఈ రోజు కాకాని మీడియాకు చూపించారు. సోమిరెడ్డి కుమారుడికి మొత్తం తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులున్నాయని, ఓ పవర్ ప్రాజెక్టులో సోమిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని ఆయ‌న ఆరోప‌ణలు గుప్పించారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సోమిరెడ్డి నిరూపించలేక‌పోతే ఆయ‌న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అన్నారు.

More Telugu News