aiadmk: అన్నాడీఎంకే కార్యాల‌యం ఎదుట తీవ్ర ఉద్రిక్త‌త.. శశికళ పుష్ప లాయర్ పై దాడి.. గాయాలు

చెన్న‌య్‌లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాల‌యం ముందు ఈ రోజు మ‌ధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అన్నాడీఎంకే పార్టీ ప్రాధాన కార్యదర్శిగా శ‌శిక‌ళే బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌న్న ప్ర‌చారం ఊపందుకుంటున్న వేళ అన్నాడీఎంకే బ‌హిష్కృత ఎంపీ శశికళ పుష్ప లాయర్ పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు. అయితే, ఆయ‌న‌పై అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. దీంతో ఆయ‌న‌కు తీవ్ర‌ గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి, అక్క‌డి ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. లాయర్ ను అక్కడి నుంచి తరలించారు. కాగా, స‌ద‌రు లాయ‌రు పార్టీ కార్యాల‌యంలో ఓ లేఖ‌ను అందించ‌డానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది

More Telugu News