demonitization: విమానాశ్ర‌యంలో భారీగా రూ.2000 నోట్లు స్వాధీనం

పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకువ‌చ్చిన కొత్త‌నోట్ల‌ను అందుకోవ‌డానికి సామాన్యుడు అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే అక్ర‌మార్కుల వ‌ద్ద‌కు మాత్రం అవి క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా వ‌చ్చి ప‌డుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్ర‌యాల్లో భారీగా కొత్త నోట్లు ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈ రోజు ఉద‌యం ముంబయి విమానాశ్రయంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తోన్న అధికారులు ఓ వ్య‌క్తి నుంచి రూ. 25 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అవి అన్నీ రూ. 2 వేల నోట్లే కావ‌డం గ‌మ‌నార్హం. ఆ డ‌బ్బుతో నిందితుడు దుబాయ్ వెళ్లాల‌ని చూశాడ‌ని అధికారులు మీడియాకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.  

More Telugu News