demonitization: మ‌నీలాండ‌రింగ్ కు పాల్ప‌డిన‌ కొటక్ బ్యాంకు మేనేజర్‌.. అరెస్ట్

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న తరువాత దేశంలో జరుగుతున్న అన్ని లావాదేవీలపై నిఘా ఉంచిన అధికారులు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న ఎంతో మంది బ్యాంకు అధికారుల‌పై ఇప్ప‌టికే చర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ క‌మీష‌న్‌ల క‌క్కుర్తితో ప‌లువురు బ్యాంకు సిబ్బంది అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ న‌ల్ల‌కుబేరుల‌కు సాయం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరో బ్యాంకు అధికారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కేజీ మార్గ్‌లోని కొటక్‌ మహింద్రా బ్యాంకు బ్రాంచిలో మేనేజర్ పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో మ‌నీలాండ‌రింగ్ కు పాల్ప‌డిన‌ట్లు తెలుసుకున్న ఈడీ అధికారులు ఈ రోజు ఉద‌యం అత‌డిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి, ద‌ర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News