raghu veera reddy: బ్యాంకుల్లో దొంగనోట్లు కూడా డిపాజిట్ అయ్యాయి: రఘువీరారెడ్డి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ రోజు ఏఐసీసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అనంత‌పురంలోని పార్టీ కార్యాలయంలో జ‌రిపిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌ పాల్గొని మాట్లాడారు. ఆర్‌బీఐ తీసుకొచ్చిన‌ కొత్త‌నోట్లు సామాన్యుల చేతిలోకి రాకముందే తీవ్రవాదుల చేతిలోకి వెళ్లాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్ర స‌ర్కారు అనుకున్న‌ లక్ష్యం నెరవేరలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బ్యాంకుల్లో దొంగనోట్లు కూడా డిపాజిట్ అయ్యాయని అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో దేశంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

More Telugu News