accident: రహదారిపై అదుపుతప్పి బీభత్సం సృష్టించిన లారీ.. ఒకరి మృతి

మేడ్చల్ ర‌హ‌దారిపై వెళుతున్న ఓ లారీ ఒక్క‌సారిగా అదుపు త‌ప్పి వాహ‌నాలు, పాద‌చారుల‌పైకి దూసుకెళ్లి బీభ‌త్సం సృష్టించింది. ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందగా, రెండు ఆటోలు ధ్వంసం అయ్యాయి. ప్ర‌మాద‌స్థలికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ ఇసుక లోడుతో వెళుతోందని పోలీసులు తెలిపారు. 

More Telugu News