: ఏపీలో త్వ‌ర‌లో 18 వేల టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ.. మంత్రి గంటా ప్ర‌క‌ట‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నిరుద్యోగుల‌కు మంత్రి గంటా శ్రీనివాస‌రావు తీపి క‌బురు చెప్పారు. త్వ‌ర‌లో రాష్ట్రంలో 18 వేల ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. మంగ‌ళ‌వారం నెల్లూరులో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ  కాంట్రాక్ట్ అధ్యాప‌కుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌న్నారు. విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని స‌మ్మె విర‌మించాల‌ని కోరారు. ఇప్ప‌టికే చాలామంది స‌మ్మె విర‌మించి క్లాసుల‌కు వెళ్తున్న‌ట్టు పేర్కొన్నారు. విద్య కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.21,500 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలిపారు.

More Telugu News