: పెద్ద నోటు రద్దుకు ప్రజాప్రతినిధులు మొగ్గు చూపినా, అంగీకరించని ‘పాక్’ ప్రభుత్వం !

నల్ల ధనవంతుల, అవినీతిపరుల ఆట కట్టించేందుకు భారత్ లో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో పొరుగుదేశమైన పాకిస్థాన్ కూడా ఆ దిశగా ఆలోచనలు చేసింది. ఈ క్రమంలో ‘పాక్’ లో పెద్దనోటు అయిన రూ.5,000ను రద్దు చేయాలని అక్కడి సెనెట్ లో ప్రజాప్రతినిధులు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నోటు రద్దుకు అధిక శాతం ప్రజా ప్రతినిధులు మొగ్గు చూపినప్పటికీ, ఆ దేశ ఆర్థికశాఖ మాత్రం ఒప్పుకోలేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుందని ‘పాక్’ ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. దీంతో, రూ.5,000 నోట్ల రద్దుకు పాకిస్థాన్ ప్రభుత్వం తిరస్కరించినట్టయింది.

More Telugu News